Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఆస్మాన్గడ్, మలక్పేట ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలు కొనసాగుతున్నాయని పాఠశాల ప్రిన్సిపల్ ఏ అరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీషు మీడియంలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు, తెలుగు మీడియంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉచిత విద్య,వృత్తి విద్య,కంప్యూటర్ శిక్షణతో పాటు హాస్టల్ సౌకర్యం ఉంటుందని తెలిపారు.