Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సప్లిమెంటరీ పరీక్షలు 3.55 లక్షల మంది హాజరు
- 855 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
- హాల్టికెట్లపై ప్రిన్సిపాళ్ల సంతకం అవసరం లేదు : జలీల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల పదో తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,55,143 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.
ఈ పరీక్షల నిర్వహణ కోసం 325 ప్రభుత్వ, 96 ప్రభుత్వరంగ, 434 ప్రయివేటు జూనియర్ కాలేజీలు కలిపి మొత్తం 855 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఇందుకోసం 855 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 855 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 19,532 మంది ఇన్విజిలేటర్లు, 102 మంది సిట్టింగ్ స్క్వాడ్లు, 50 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్లను నియమించామని పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలుంటాయని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలనీ, వాటిపై ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు.