Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్కుమార్ ఆకాంక్షించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోని కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామిని సందర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయన్ను పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. అనంతరం తనను కలిసి విలేకర్లతో ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.