Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం ప్రకటన పట్ల టీజీఎస్, కేవీపీఎస్ హర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోలీస్ రిక్రూట్మెంట్లో దళిత, గిరిజన అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గించాలని గత కొన్ని రోజులుగా దళిత ,గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. ఫలితంగా ఇతర అభ్యర్థులకు తగ్గించినట్టే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కూడా కటాఫ్ మార్కులను తగ్గిస్తామంటూ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటన పట్ల తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్,ఆర్ శ్రీరాం నాయక్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్వెస్లీ, టి స్కైలాబ్బాబు సోమవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.