Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూడెమోక్రసీ ఖండన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వీఆర్ఏలు, ఉపాధ్యాయులు, సింగరేణి కార్మికులు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాలపై ప్రభుత్వ దాడిని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సూర్యం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమస్యలను పరిష్కరించాలంటూ ఉద్యమిస్తున్నవారిపై టీఆర్ఎస్ ప్రభుత్వం దమనకాండను ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారిపై లాఠీచార్జి చేయడం, ఉపాధ్యాయులను అరెస్టు చేసి నిర్బంధించడం సిగ్గుచేటని తెలిపారు. ఫాసిస్టు మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేసీఆర్ అదే బాటలో కొనసాగడం, నిరసనలను అణచివేయడం నిరంకుశ విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.