Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్టోబర్ 10 నుంచి తరగతులు షురూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 26 నుంచి వచ్చేనెల తొమ్మిది వరకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. ఈ మేరకు అకడమిక్ క్యాలెండర్లో గతంలోనే పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. వచ్చేనెల ఐదున దసరా పండుగ ఉన్నది. అందుకు పది రోజుల ముందునుంచే విద్యార్థులకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈనెల 25 ఆదివారం కానుంది. దీంతో దసరా సెలవులు 15 రోజులు కానున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. పాఠశాలల్లో వచ్చేనెల పది నుంచి తిరిగి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంకోవైపు రాష్ట్రంలోని పాఠశాలలు, వసతి గృహాల్లో రాబోయే 15 రోజులపాటు శానిటేషన్, పరిశుభ్రత డ్రైవ్ను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో మధ్యాహ్న భోజనం, వంటగదితోపాటు పాఠశాల ఆవరణ, పరిసరాలను తగు జాగ్రత్తలు తీసుకుంటూ పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.