Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నవతెలంగాణ ఎడిటోరియల్ బోర్డు సభ్యులు, సీఐటీయూ ఉమ్మడి రాష్ట్ర కమిటీ సభ్యులు టీఎన్వీ రమణ అనారోగ్యంతో చనిపోయారనీ, ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. రమణ సీఐటీయూ రాష్ట్ర కార్యాలయం ఆఫీస్ కార్యదర్శిగా, కార్మికలోకం మాసపత్రిక బోర్డు సభ్యులుగా పనిచేశారని గుర్తుచేశారు. కార్మికలోకం మాసపత్రికను రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల్లో తీసుకపోవడంలో ఆయన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. హైదరాబాద్ జిందాబాద్, నవతెలంగాణ పత్రికలో అనేక బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. రమణ మరణం కార్మికలోకానికి తీరనిలోటని పేర్కొన్నారు.