Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ న్యాయమైన డిమాండ్ల కోసం, సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ అసెంబ్లీకి తమ గోడును తెలిపేందుకు వచ్చిన సింగరేణి కాంట్రాక్టు కార్మికులు, వీఆర్ఏలు, ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్టు సీఐటీయూ ప్రకటించింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యమాలను అణచివేయడం సబబు కాదని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రకటించిన హామీలను నెరవేర్చకపోతే ఎలా? అని ప్రశ్నించారు. వెంటనే సింగరేణి కాంట్రాక్టు కార్మికులు, వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయుల సమస్యను కూడా వీలైన త్వరంగా పరిష్కారించాలని డిమాండ్ చేశారు.