Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అదే పనిగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న ఈటల రాజేందర్ ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు లేవో చెప్పాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈటలది రక్తచరిత్ర అనీ, నర్సింగాపూర్లో ఎంపీటీసీ రాజు చంపించారనీ, ఉద్యమకారుడు ప్రవీణ్ యాదవ్పై మంత్రిగా ఉన్నప్పుడు దాడి చేయించారనీ, 25 రోజుల క్రింత మల్లయ్యపై దాడి చేయించారని ఆరోపించారు. తాను చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటి అబద్ధమైనా ముక్కు నేలకు రాస్తానని తెలిపారు.