Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత పార్లమెంటు నూతన భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరును పెట్టాలని రాష్ట్ర శాసనసభ తీర్మానించడంపై తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కె.ఏసురత్నం, ప్రధాన కార్యదర్శి నర్రా శ్రవణ్ తదితర నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సమితి బుధవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించే కమిటీకి నాయకత్వం వహించిన న్యాయ నిపుణుడు, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త మరియు రాజకీయ నాయకుడు, జవహర్లాల్ నెహ్రూ మొదటి మంత్రివర్గంలో న్యాయ శాఖ మంత్రిగా సేవలందించిన .అంబేద్కర్ పేరు పెట్టడం సముచితమని పేర్కొన్నారు.