Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉక్రెయిన్లో చదివిన భారతీయ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలీఉల్లా ఖాద్రి, ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి సీట్లను సర్దుబాటు చేసి సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొన సాగుతున్న దని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్ కు చెందిన సుమారు 20 వేల మందికి పైగా వైద్య విద్యార్థుల భవిత అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.