Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గిరిజన జనాభా ప్రాతిపదికన ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ డిమాండ్ చేశారు. పదిశాతం రిజర్వేషన్లు దేని ప్రకారం ఇస్తారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.శనివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. మూడు లక్షల ఎకరాలకు పైగా పోడు భూములకు పట్టాలిచ్చిందని తెలిపారు. సిలేరు ప్రాజెక్టు ఆంధ్రప్రదేశలో కలిసిందనీ, దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.