Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొండా లక్షణ్ బాపూజీ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాపూజీ మూడు తరాల ఉద్యమ యోధుడు, తెలంగాణ జాతిపిత, సబ్బండ వర్గాల సాధికారతతో కూడిన సామాజిక తెలంగాణ కోసం పరితపించి చివరకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహా మనిషి అని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27న ఆయన జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కోరారు.