Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీతాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 1,654 మంది గెస్ట్ లెక్చరర్లకు సంబంధించి ప్రస్తుత విద్యాసంవత్సరంలో జులై, ఆగస్టు జీతాలు రూ.9.28 కోట్లు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. జీతాలను విడుదల చేయడం గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, గెస్ట్ లెక్చరర్ల జేఏసీ అధికార ప్రతినిధి దేవేందర్ యాదవ్ కుంట ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రకటించారు.