Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ హామీల అమలు కోరండి
- టీఆర్ఎస్ లోకసభ పక్షనేత నామా నాగేశ్వరరావుకు రైతు సంఘం వినతి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కిసాన్మోర్చా ఆధ్వర్యంలో 2020-21లో జరిగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం సందర్భంగా కేంద్రప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీల అమలును పార్లమెంటులో ప్రస్తావించాలని తెలంగాణ రైతు సంఘం టీఆర్ఎస్ లోక్సభాపక్షనేత నామా నాగేశ్వరరావకు విజ్జప్తి చేసింది. ఈ మేరకు సోమవారం ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శనరావు, టీ సాగర్, ఉపాధ్యక్ష, సహాయ కార్యదర్శులు నున్న నాగేశ్వరరావు, మూడ్ శోభన్ తదితరులు హైదరాబాదు జూబ్లీహిల్స్లో నామా నాగేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించింది. కేంద్రం హామీ ఇచ్చిన కనీస మద్దతు ధరల అమలు కోసం కమిటీ ఏర్పాటు, విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంటులో చర్చకు పెట్టేముందు సంయుక్త కిసాన్ మోర్చాతో సంప్రదింపులు చేస్తామనే వాగ్దానాలను ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు.