Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దసరా పండుగ (బుధవారం)నాడు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో నిర్వహించతలపెట్టిన టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంయధావిధిగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ నేపథ్య ంలో ఆ సమావేశంపై దాని ప్రభావం ఉండబోదని ఆయన తెలిపారు. పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు అనుమానాలకు గురి కావొద్దని పేర్కొన్నారు. ముందుగా ప్రకటించిన ప్రకారం... బుధవారం ఉదయం 11 గంటలకు పార్టీ సర్వసభ్య సమావేశం కొనసాగుతుందని వివరిం చారు. అందరూ సకాలంలో హాజరు కావాలంటూ ఆదేశించారు.