Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతున్న 36వ జాతీయ క్రీడల పోటీల్లో 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో రాష్ట్రానికి తొలి బంగారు పతకం సాధించిన ఈషాసింగ్ను క్రీడాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అభినందించారు. మంగళవారం హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో ఆయన ఈషాసింగ్ను శాలువాతో ఘనంగా సత్కరించారు. తొలిసారిగా జాతీయ క్రీడల్లో పాల్గొని పతకం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.