Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిషప్ సాల్మన్ రాయ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారతదేశాన్ని లౌకిక దేశంగా ఉంచేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని బిషప్ సాల్మన్ రాయ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు కేసీఆర్కు మద్ధతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సాల్మన్ రారు మాట్లాడుతూ, మతతత్వ పార్టీలతో దేశానికి ముప్పుందని హెచ్చరించారు. అందువల్ల దేశ రక్షణ కోసం మనమంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని క్రైస్తవులంతా కేసీఆర్ వెంటే ఉంటారని తెలిపారు. జాతీయ పార్టీ ప్రకటిస్తున్న సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.