Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల ఆరున ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏడున ఆమె కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశం అయ్యే అవకాశముంది. ముందుగా తలపెట్టిన పాదయాత్రను ఆపి మరీ ఆమె ఢిల్లీకి వెళ్తుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ షర్మిల ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇప్పటికే గవర్నర్ తమిళిసైకి సైతం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి మరోసారి ఆమె ఫిర్యాదు చేయొచ్చని సమాచారం.