Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి సహా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, వి శ్రీనివాస్గౌడ్ తదితరులు రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని మంగళవారం వేర్వేరుగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దసరా సందర్భంగా పాలపిట్టను దర్శించుకుని జమ్మిచెట్టుకు పూజలు చేసే గొప్ప సంప్రదాయం ఉందని తెలిపారు. జమ్మి ఆకునే బంగారంలా భావించి పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ అలరు బలరు తీసుకుంటారని వివరించారు. పండుగ రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా విజయం సాధిస్తామన్న గొప్ప నమ్మకం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని కోరారు.