Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుత విద్యాసంవత్సరంలో గతనెల 25న ఆదివారంతో కలిపి 26 నుంచి ఆదివారం వరకు దసరా సెలవులిచ్చిన విషయం తెలిసిందే. సెలవుల అనంతరం సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పాఠశాలలకు మళ్లీ పరుగులు పెట్టనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు సైతం సోమవారం పున:ప్రారంభమవుతాయి.