Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-పాన్గల్
చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు అరుణజ్యోతి, మల్లు లక్ష్మి తెలిపారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం రేమద్దుల గ్రామంలో మూడు రోజులపాటు నిర్వహించిన జిల్లా స్థాయి స్టడీ సమావేశం ఆదివారం ముగిసింది. అనంతరం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో మహిళలను గౌరవించాలని సూచించారు. బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, దేశంలో మహిళలపై లైంగిక దాడులు, హత్యలు పెరిగిపోతుందని విమర్శించారు. మహిళల సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. లేదంటే ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఐద్వా నాయకులు, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.