Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
లారీ యజమానుల సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికలో తాము పోటీ చేయట్లేదని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మంచిరెడ్డి రాజేందర్రెడ్డి తెలిపారు. ఈ నియోజకవర్గంలో 101 నామినేషన్లు వేయాలని తమ సంఘం నిర్ణయించిందనీ, ఇప్పుడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు నన్నపనేని రవీందర్, రవీంద్రనాయక్ ఆధ్వర్యంలో లారీ యాజమాన్యాల సంఘాల అసోసియేషన్ ముఖ్య నాయకులు, ప్రతినిధులు రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావును కలిసినట్టు తెలిపారు.
లారీ యజమానుల సమస్యలను ఆయన దష్టికి తీసుకెళ్లామనీ, వాటి పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. అప్పటికప్పుడే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు ఫోన్ చేసి, సాధ్యమైనంత త్వరగా లారీ యజమానుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ చెప్పారనీ, దానికి సీఎస్ సానుకూలంగా స్పందించారని వివరించారు. ఉమ్మడి రాష్ట్రాల మధ్య కామన్ పర్మిట్తో పాటు ఓవర్ లోడ్ జరిమానాలు, గ్రీన్ టాక్స్ వంటి కీలకమైన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు.