Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ సిద్ధాంతాలకు విరుద్ధంగాగానీ, పార్టీ లైన్ దాటిగానీ ఎప్పుడూ ప్రవర్తించలేదని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. బీజేపీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై సోమవారం ఆయన స్పందించారు. పార్టీ కార్యకర్తగా సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని కేంద్ర నాయకత్వానికి లేఖ రాశారు. పార్టీ ఉల్లంఘనకు పాల్పడలేదని పేర్కొన్నారు. హిందూ ధర్మ కోసం పోరాడుతున్నందుకే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారనీ, ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి తనపై ఇప్పటిదాకా 100 కేసులు పెట్టాయని తెలిపారు. ఇతర మతాల దేవుళ్లను తాను కించపర్చలేదని పేర్కొన్నారు. కొందర్ని రెచ్చగొట్టడానికే మునావర్ ఫారుకీ షోను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.కాగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి ములాయంసింగ్ యాదవ్ మృతికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కుమార్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంతాపం తెలిపారు.