Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో తిరుగేలేదని విర్రవీగుతున్న బీజేపీకి ప్రజలు బుద్ది చెప్పారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్ వెంకట్రాములు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మతోన్మాద బీజేపీని నివారించటం కోసం పనిచేసిన వ్యవసాయ కార్మికులందరికీ అభినందనలు తెలిపారు. డబ్బు, కుల ఆధారంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం సాధ్యం కాదని రుజువైందని పేర్కొన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోవాలనీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.