Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేసీఆర్ ప్రధాని పర్యటనలకు దూరంగా ఉండటం సబబు కాదనీ, ఇలా చేయడం మూడోసారి అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం బేగంపేట ఎయిర్పోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ పర్యటనను అడ్డుకోవాలన్న పిలుపును ఆయన తప్పుబట్టారు. జీఎస్టీ కౌన్సిల్లో పాల్గొన సందర్భంలో హరీశ్రావు చేనేతపై జీఎస్టీకి అంగీకారం తెలిపి ఇప్పుడు కేంద్రంపై బురద చల్లడం సబబు కాదన్నారు. రాజకీయాలకు, అభివృద్ధికి మధ్య వ్యత్యాసాలను కేసీఆర్ గుర్తించడం లేదన్నారు. కేసీఆర్ నిర్ణయాలు రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయని విమర్శించారు.