Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అటానమస్ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు తాము రూపొందించిన మార్గదర్శకాలను అమలు చేయాలంటూ జేఎన్టీయూహెచ్ ఆదేశాలు జారీ చేసిందని టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్కుమార్ తెలిపారు. వాటిని అమలు చేయాలనడం సంతోషమే కానీ ఇప్పటికే ఉన్న కనీస నిబంధనలను ఆయా కాలేజీలు అమలు చేయడం లేదనే విషయాన్ని గుర్తించాలని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. నిబంధనలు పేపర్పైనే ఉంటాయనీ, ప్రత్యక్షంగా అవి అమలు కావడం లేదని పేర్కొన్నారు. అటానమస్ కాలేజీల్లో పరీక్షల విభాగం ప్రశ్నలను ముందుగానే ఇవ్వడం, అవే ప్రశ్నాపత్రాలను రూపొందించడం ఎన్నో సందర్భాల్లో చూశామని తెలిపారు. దాని ద్వారా విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని విమర్శించారు. మొదటి ఏడాదిలో ఎక్కువ శాతం మంది విద్యార్థులను ఫెయిల్ చేస్తున్నారని తెలిపారు. అయితే చివరి ఏడాది వచ్చే వరకు 95 శాతం మంది ఉత్తీర్ణత పొందుతున్నారని పేర్కొన్నారు. దీనిపై వర్సిటీ అధికారులు మరింత దృష్టి సారించాలనీ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.