Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.కోటి కేటాయించిన ఎంపీ సంతోష్:మంత్రి హరీశ్రావు అభినందన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తాను జన్మించిన పేట్ల బుర్జు ఆస్పత్రి అభివృద్ధికి రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ రూ.కోటి కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన్ను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి హరీశ్రావు అభినందించారు. ''కన్న తల్లిని, జన్మ భూమిని మరువద్దు అంటారు. ఇదే బాటలో రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్, ఆయన పుట్టిన పేట్ల బుర్జు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలు కేటాయించడం సంతోషం. ఆయన పుట్టిన ఆస్పత్రిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని, అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయం.'' అని మంత్రి హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంతోష్ నిర్ణయం ఎంతో మందికి స్ఫూర్తిని కలుగజేసి, ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి ముందుకొచ్చేందుకు దోహద పడుతుందని పేర్కొన్నారు. ఈ నిధులతో పేట్లబుర్జు ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. సంతోష్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన వారు, ఆయా ఆస్పత్రుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. పేట్లబుర్జు ఆస్పత్రి అవసరాలు, సౌకర్యాలు తీర్చేలా ఈ నిధులను వినియోగించాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు.