Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భర్త వేధింపులే కారణం
నవతెలంగాణ-దామెర
భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ తన పది నెలల పసికందుతో సహా వ్యవసాయ బావిలోదూకి తల్లి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊరుగొండలో శుక్రవారం జరిగింది. బాధితురాలి తల్లి రావుల సరళ తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండలం హౌస్ బురుగు గ్రామానికి చెందిన నిమ్మల ఆమని (29)ని ఆమె భర్త మురళి నిత్యం కట్నం డబ్బులు తీసుకురావాలని వేధిస్తుండేవాడు. దానికి తోడు ఆడపిల్ల పుట్టిందనే నెపంతో ఇంకా వేధింపులు గురిచేసేవాడు. దాంతో భరించలేక ఆమని, తన కూతురు అశ్వితసాయి (10నెలలు)తో సహా ఆత్మహత్య చేసుకున్నది. రావుల సరళ ఫిర్యాదు మేరకు మురళిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ హరిప్రియ, పరకాల రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.