Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో దర్యాప్తు ముమ్మరం
- నందకుమార్ హౌటల్లో సిట్ తనిఖీలు
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఇటీవలే ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సోమయాజి, నందకుమార్ ను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించింది. విచారణ సందర్భంగా నిందితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా శనివారం సాయంత్రం సిట్ అధికారులు.. నందకుమార్కు చెందిన ఫిలింనగర్లోని దక్కన్ హౌటల్లో తనిఖీలు నిర్వహించారు. రామచంద్రభారతి, సింహయాజి ఇదే హౌటల్లో బస చేసినట్టు గుర్తించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను సేకరిస్తున్నట్టు సమాచారం.
హౌటల్కు నిందితులు ఎప్పుడు వచ్చారు? వారితో ఎవరెవరు వచ్చారు? ఎన్ని రోజులు బస చేశారు? అనే కోణంలో సిట్ అధికారులు దృష్టిసారించారు. ప్రధాన నిందితుడు రామచంద్రభారతి గత నెల 26న ఢిల్లీ నుంచి విమానంలో వచ్చినట్టు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. రామచంద్రభారతితో పాటు ఢిల్లీ నుంచి ఇంకా ఎవరైనా వచ్చారా? అని ఆరా తీస్తున్నారు. పైలట్ రోహిత్రెడ్డికి రూ.100 కోట్లు, మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలకు రూ.50కోట్ల చొప్పున ఇస్తామని రామచంద్రభారతి చెప్పినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి డబ్బులు తెచ్చారా? రామచంద్రభారతితో పాటు వచ్చిన వ్యక్తులు హౌటల్లో బస చేశారా? అనే వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. సిట్ బృందం దర్యాప్తు మొత్తం రామచంద్రభారతి కేంద్రంగానే కొనసాగుతోంది.