Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాని మోడీ రాక సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఐఎఫ్టీయూ, ఇతర సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్రావు ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ప్రజలకు మోడీ సమాధానం చెప్పాలని కోరారు. లాభాలతో నడుస్తున్న సింగరేణి బొగ్గుబావులను ఎందుకు అమ్మేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను, ఖనిజ సంపదను కారుచౌకగా కార్పొరేట్లకు ఎందుకు అమ్ముతున్నారని అడిగారు. కార్మికులను కార్పొరేట్ అధిపతులు, పెట్టుబడిదారులు విచ్చలవిడిగా దోచుకునే నాలుగు లేబర్ కోడ్లను ఎందుకు తెచ్చారని తెలిపారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ఎందుకు అమలు చేయలేకపోయారని ప్రశ్నించారు.