Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్ లైన్ ద్వారా ఈ నెల 9 వరకు దరఖాస్తు చేసుకోవాలి : కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ వ్యవసాయ మహిళా గురుకుల కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేయడానికి రిటైర్డ్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనా సిబ్బంది నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సంస్థ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి, కరీంనగర్లో ప్రారంభమైన ఆయా కాలేజీల్లో పనిచేయడానికి అర్హులైన వారు తమ బయోడేటాను [email protected]కు పంపించాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 14 ,15 తేదీల్లో డెమో/ఇంటర్వ్యూ నిర్వహిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల వెబ్ సైట్ http://mjptbcwreis.telangana.gov.inను సందర్శించాలని సూచించారు.