Authorization
Wed April 30, 2025 08:06:25 am
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు అర్థం లేనివని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు షర్మిల తెలిపారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందనీ, ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలవడమేంటని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలను కలపడంపై శ్రద్ధ పెట్టేకంటే..ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని హితవు పలికారు.