Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాదయాత్రకి అనుమతినివ్వాలనీ, అక్రమంగా అరెస్ట్ చేసిన పార్టీ నేతలను విడుదల చేసే వరకు దీక్ష ఆపేది లేదంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల శనివారం హైదరాబాద్లోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. లోటస్ పాండ్ వద్ద కొనసాగుతున్న పోలీసుల నిర్భంధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తలను లోపలకు రానివ్వకుండా అడ్డుకోవటమేంటని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులను ఆపాలన్నారు. రెండో రోజు కూడా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆరోగ్యం క్షీణిస్తున్నదని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.