Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నవీపేట్
కాసేపట్లో పెండ్లి పీటలెక్కాల్సిన యువతి.. ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఎస్ఐ రాజారెడ్డి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని కోమటిగల్లికి చెందిన ర్యాగళ్ల రవళి(26)కి మూడు నెలల కిందట నిజామాబాద్లోని జెండా గల్లీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సంతోష్తో నిశ్చితార్థం అయింది. కాగా నిజామాబాద్లోని జనార్ధన్ గార్డెన్లో ఆదివారం పెండ్లికి వెళ్లాల్సి ఉండగా.. అంతలోనే వధువు వేకువజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. రవళి ఎంసీఏ చదవడంతో తనతో పాటు ఉద్యోగం చేయాలని వరుడు సంతోష్ వేధించడమే మృతికి కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు మీడియాతో తెలిపారు.