Authorization
Thu May 01, 2025 08:12:12 am
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకారవేతనాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.