Authorization
Fri May 02, 2025 09:43:00 am
- సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
మండల, జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను ప్రకటించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అందుకనుగుణంగా విద్యా, గిరిజన సంక్షేమశాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన శనివారం లేఖ రాశారు. బదిలీలు, పదోన్నతులపై సీఎం... గతంలో శాసనసభలో హామీనిచ్చారని గుర్తు చేశారు. కానీ ఆ హామీ ఇప్పటి వరకూ నోచుకోలేదని తెలిపారు.