Authorization
Sat May 03, 2025 02:15:53 am
నవతెలంగాణ- సిటీబ్యూరో
రాష్ట్రంలోని మైనార్టీ తరగతులకు చెందిన యూజీ, పీజీ విద్యార్థుల ఉన్నత చదువుల నిమిత్తం ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తులకు నోటిఫికేషన్ జారీ అయింది. అమెరికా, లండన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, న్యూజిలాండ్, సౌత్ కొరియాతోపాటు సింగపూర్ వంటి దేశాల్లో చదువుకోవడానికి అర్హతలు ఉన్న వారు ఓవర్సిస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ముహమ్మద్ ఇల్యాస్ అహ్మద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 31మధ్యలో (ఫాల్ సీజన్) అడ్మిషన్లు పొందినవారు ఈ మేరకు దరఖాస్తులు చేసుకునే విధంగా మైనార్టీ విద్యార్థులకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. ఈనెల 3 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై.. 23 వరకు గడువు కొనసాగుతుందని వివరించారు. ఆన్లైన్ ద్వారా చేసుకున్న దరఖాస్తుల ప్రతులను ఫిబ్రవరి నెలాఖరులోగా సాయంత్రం 5గంటలలోపు హైదరాబాద్ జిల్లా మైనార్టీ అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు. పూర్తి వివరాల కోసం తెలంగాణ ఈపాస్ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలన్నారు. www.telanganaepass.cgg.gov. వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు ఉండాలన్నారు.