Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్లో బీజేవైఎం కార్యకర్తలు, పోలీసు పరీక్ష అభ్యర్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల మంది పోలీస్ అభ్యర్థుల విన్నపాన్ని వినే సమయం సీఎంకు లేదా? అని ప్రశ్నించారు. బీజేవైఎం కార్యకర్తల పట్ల విచక్షణ రహితంగా వ్యవహరించిన పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు పరీక్షల్లోని నిబంధనలను సవరించి అన్యాయానికి గురైన అభ్యర్థులకి న్యాయం చేయాలని కోరారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిబంధనలను మార్చాలని డిమాండ్ చేశారు.