Authorization
Wed April 30, 2025 09:55:46 am
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి - హైదరాబాద్
మలక్పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోవడం అత్యంత దారుణమని, ఇది మనసును కలిచివేస్తున్నదని తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ విచారం వ్యక్తం చేశారు. హైదరాబాదుకు చెందిన శివాని అనే గర్భిణికి డెంగ్యూ, బీపీ ఉన్నప్పటికి తగిన వైద్య పరీక్షలు చేయకుండా వైద్యులు ఆపరేషన్ చేయడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమై మరణించారని చెప్పారు. నాగర్ కర్నూలుకు చెందిన మరో గర్భిణి సిరివెన్నెలకు సైతం డెంగ్యూ ఉన్నప్పటికి.. దాన్ని గుర్తించకుండా వైద్యులు నిర్లక్ష్యంగా డెలివరీ చేయడంతో ఆమె ఫ్లెట్ లెట్స్ పడిపోయి చనిపోయిందని వివరించారు. ఇద్దరి మహిళల ప్రాణాలను బలి పెట్టిన ఈ ఘోర ఘటనకు ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యశాఖ మంత్రి హరిష్ రావు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మృతి చెందిన బాలింతల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం తో పాటుగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబులు బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన చేశారు.