Authorization
Thu April 10, 2025 02:39:21 am
- వడగండ్లు పడే అవకాశం
- ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ
- సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 170కిపైగా ప్రాంతాల్లో వర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చనీ, పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కూడా పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఈమేరకు ఆరెంజ్ హెచ్చరికలను జారీచే శారు. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్లగొండ, జగిత్యాల, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబూనగర్ జిల్లాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షం పడే సూచనలున్నాయి. హైదరాబాద్లోనూ రాబోయే 48 గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు కొన్ని సమయాల్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. సోమవారం రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో172 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్లో అత్యధికంగా 4.3 సెంటీమీటర్ల వర్షం పడింది.