Authorization
Mon May 05, 2025 06:50:09 am
అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నవతెలంగాణ -వెంకటాపురం
పోడు భూముల హక్కుపత్రాల కోసం అర్హులందరూ తప్పని సరిగా దరఖాస్తు చేసుకోవాలని ములుగు అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం మరికాల పంచాయతీ లక్ష్మినగరంలో పోడుభూములు, అటవీహక్కుల సంరక్ష కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషినల్ కలెక్టర్ మాట్లాడారు. పోడురైతులు దరఖాస్తులను స్థానిక, మండల, సబ్డివిజన్, జిల్లా స్దాయి కమిటీలు పరిశీలిస్తాయని పేర్కొన్నారు. 2005 డిసెంబర్ 13 నాటికి పోడుచేసుకుంటున్న అందరూ తప్పని సరిగా ధరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునే విధానాన్ని ఆదివాసీలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, తహసీల్దార్ నాగరాజు, ఫారేస్ట్ బీట్ ఆఫీిసర్, పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.