Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
మండలంలోని రాచకొండ, కడిలాబాయితండా, తుంబాయి తండాల్లో కరోనా బాధితులకు బుధవారం డీసీపీ నారాయణ రెడ్డి స్వస్తియా సేవా సంస్థ సహకారంతో మందులు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కరోనా బాధితులు ఎవరు అధైర్య పడొద్దని ధైర్యంగా ఉండి డాక్టర్ల సలహాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ రూరల్ సీిఐ ఎరుకొండ వెంకటేష్, నారాయణపురం ఎస్ఐ చందా సుధాకర్ రావు, సర్పంచులు శ్రీను నాయక్, గణేష్, జగన్ పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.