Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతలపాలెం
స్మశాన వాటిక, ఉపాధి హామీ పనులను పరిశీలించారని ఎంపిడిఒ పి గ్యామా నాయక్ అన్నారు. మండలపరిధిలోని పులిచింతల ప్రాజెక్టు కాలనీలో శ్మశానవాటికను, గాంధీనగర్తండా, దొండపాడు గ్రామ పంచాయతీలలో ఉపాధిపనులను ఎంపీడీఓ గ్యామానాయక్ బుధవారం పరిశీలించారు.కూలీలకు కోవిడ్ 2019 నిబంధనల ప్రకారం మాస్కు ధరించి, శానిటైజర్ తెచ్చుకొని, మనిషికి మనిషికి మధ్య కనీసం ఆరు అడుగుల దూరం పాటిస్తూ పనిచేయాలని తెలిపారు.గరిష్ట కూలి రూ.245 పొందేందుకు కూలీలు చేయాల్సిన పని కొలతలను వివరించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఈసీ రవి,సర్పంచ్,పంచాయతీ కార్యదర్శి అనిత పాల్గొన్నారు.