Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
మునుగోడు తహసీల్దార్గా జక్కర్తి శ్రీనివాసులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న సునంద కరోనా బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహించి నాలుగు నెలల క్రితం తహసీల్దార్గా పదోన్నతి పొంది దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో డీఏవోగా విధులు నిర్వహించిన జక్కర్తి శ్రీనివాసులును మునుగోడు తహసీల్దార్గా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ మండలంలో నెలకొన్న భూ సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి, ఆర్ఐలు దుర్గా మల్లేశ్వరి, శ్రీనునాయక్, కంప్యూటర్ ఆపరేటర్లు శ్రీను, అనిల్ తదితరులు పాల్గొన్నారు.