Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సుందరి భిక్షమయ్య ఆశయ సాధనకు పాటుపడాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి షేక్ యాకుబ్ కోరారు.భిక్షమయ్య వర్థంతి సందర్భంగా శుక్రవారం ఆయన చిత్రపటానికి మండల నాయకులు, కుటుంబ సభ్యులు పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిక్షమయ్య మండలంలో సీపీఐ(ఎం) బలోపేతానికి ఎనలేని కషి చేశారన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడేవాడన్నారు.కీతవారిగూడెంకు సుదీర్ఘ కాలం సర్పంచ్గా పనిచేసి గ్రామాభివద్ధికి ఎంతో పాటుపడిన వ్యక్తి అని, ఆయన లేని లోటు పార్టీకి తీరనిలోటన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు తుమ్మల సైదయ్య, ఎల్లావుల నారాయణ, బొమ్మకంటి వెంకయ్య, బొల్లేపల్లి శ్రీను, గూడెపు లక్ష్మీనర్సు, బండారు భిక్షం, భిక్షమయ్య సతీమణి రాములమ్మ, కుమారులు సుందరి వీరరాఘవయ్య, సత్య పాల్గొన్నారు.