Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మునుగోడు
ప్రతి ఆడ బిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మీ పథకం కింద ప్రభుత్వం రూ.లక్ష సాయం చేస్తుందని ఎంపీపీ కర్నాటి స్వామి, జెడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణిరవి ముదిరాజ్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 129 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ పథకం కింద మంజూరైన రూ.కోటీ 29 లక్షల చెక్కులను బుధవారం తహశీల్దార్ జకర్తీ శ్రీనివాసులు సమక్షంలో లబ్దిదారులకు అందజేసి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ప్రజలు నేరుగా అధికారులను సంప్రదించి లబ్దిపొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ దొర విజయలక్ష్మి, ఎంపీటీసీలు చాపల మారయ్య, మోగుదాల సాలయ్యగౌడ్ , సర్పంచులు గుర్రం సత్యం, జాల వెంకన్నయాదవ్, జక్కల శ్రీనుయాదవ్, కోఆప్షన్ సభ్యులు ఎమ్డి.రఫీక్ తదితరులు పాల్గొన్నారు.