Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
సీపీఐఎం సీనియర్ నాయకులు నెర్లకంటి రామలింగం భార్య భారతమ్మ సేవలు పార్టీకి చేసిన సేవలు మరువలేనివని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు.ఆదివారం ఆమె అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మతదేహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం, ప్రజా సంక్షేమం కోసం వారి కుటుంబసభ్యులు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి, భువనగిరి జిల్లా నాయకులు దోనూరినర్సిరెడ్డి, రోడ్డ అంజయ్య, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, కేవీపీఎస్ జిల్లా నాయకులు బొట్ట శివకుమార్, పార్టీ మండలకార్యదర్శి ఆకుల వెంకట్రామ్, సహాయకార్యదర్శి ఏర్పుల యాదయ్య, సాలయ్య, రఘుమారెడ్డి, హనుమంతు, సత్తయ్య పాల్గొన్నారు.