Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి
నవతెలంగాణ-చండూరు
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని గట్టుప్పల్ గ్రామంలో పార్టీగ్రామశాఖ 11వ మహాసభ ఎండి.రబ్బాని అధ్యక్షతన నిర్వహించారు.సభ ప్రారంభసూచకంగా పార్టీ అరుణపతాకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.నాటి నుండి నేటి వరకు ప్రజల తరపున నికరంగా పోరాడుతున్న నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులేనన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై, గ్రామంలో డ్రయినేజీ, సిమెంట్రోడ్లు, ఇండ్ల స్థలాలు,పెన్షన్స్ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలన్నారు.నరేంద్రమోడీ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకొచ్చిన తర్వాత కార్పొరేట్ల ప్రయోజనాలకోసం దేశ సంపదను లూటీ చేస్తుందని విమర్శించారు.ఇందులో భాగంగానే రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చారని ప్రభుత్వ రంగసంస్థలు అమ్ముతున్నారన్నారు.ఈ విధానాలు మానుకోకపోతే ప్రతిఘటన పోరాటాలు తప్పవని హెచ్చరించారు. కరోనా వచ్చి ప్రజలు ప్రజల ఉద్యోగాలు, ఉపాధిపోతుంటే ఆకలితో అలమటిస్తుంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మొట్టికాయలు వస్తే తప్ప స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వం పేదలకు భూములు పంచమంటే లేవు అని చెప్పి ప్రభుత్వ భూముల అమ్ముకొని డబ్బులు సమకూర్చుకోవడం సిగ్గుచేటన్నారు.జిల్లాలో వెల్మకన్నె ఫీడర్చానల్, ఇతర పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ప్రజాసమస్యలపై నికరంగా పోరాడేది ఎర్రజెండానే అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండిశీశైలం, జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బొట్టు శివకుమార్, ఎఫ్ఏసీ డైరెక్టర్ అచ్చిన శ్రీనివాసులు,మండల కమిటీ సభ్యులు కాకునూరి నగేష్, పగిళ్లశ్రీనివాస్, శాఖ కార్యదర్శులు కర్నాటి సుధాకర్, ఖమ్మం రాములు పాల్గొన్నారు.న