Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు
నవతెలంగాణ-మిర్యాలగూడ
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు నేడు మిర్యాలగూడ నియోజకవర్గంలో మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కోరారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజక వర్గంలో ఏర్పాటు చేసిన రైతు వేదిక భవనాలు, భూసార పరీక్షా కేంద్రంతో పాటు, పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు.